
పాడిపరిశ్రమతో మంచి లాభాలు
షాబాద్: వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ అధికారి డా.కె కిషన్ కుమార్, రిటైర్డ్ ప్రొఫెసర్ కొండల్రెడ్డి, సేవాస్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడలో శనివారం శాసీ్త్రయ పద్ధతుల ద్వారా డెయిరీ, పాల ఉత్పత్తుల విలువల అభివృద్ధిపై రైతులకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శాసీ్త్రయ పద్ధతులు, ప్రభుత్వ పథకాల వినియోగం, వ్యాపార నైపుణ్యాల సాధన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. పశుపోషణ, ఆవుల గదుల నిర్మాణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే విధానాల వంటి అంశాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సులభంగా చేయగల మజ్జిగ, నెయ్యి, క్రీమ్ తయారీపై డెమో ఇచ్చారు. అనంతరం కోవా, కలాకండ్, పనీర్ చన్నా, రసగుల్లా, రసమలై, బాసుంది, మజ్జిగ, లస్సీ, ఫ్లేవర్డ్ మిల్క్, వే డ్రింక్స్ వంటి విలువ ఆధారిత పాల ఉత్పత్తుల తయారీపై వర్క్షాప్ నిర్వహించారు. డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి పశు ఆరోగ్య సంరక్షణ గురించి వివరించారు. కార్యక్రమంలో పాడి రైతులు పాల్గొన్నారు.