
రైతులకు ‘సహకారం’ అందించాలి
అబ్దుల్లాపూర్మెట్: ప్రతి రైతుకూ మేలు చేసేలా సహకార సంఘాలు పని చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బాటసింగారం రైతు సేవా సహకార సంఘం ఆవరణలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించిన ఎరువుల గోదాంను సహకార సంఘం చైర్మన్ చేగూరి భరత్కుమార్, గడ్డిఅన్నారం వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రైతులకు తెలియజేయాలని సూచించారు. సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చైర్మన్ భరత్ కుమార్ మాట్లాడుతూ.. గడిచిన 14 నెలల్లో సంఘం పరిధిలోని రైతులకు రూ.31 కోట్ల మేర వివిధ రకాల రుణాలు అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయ, సంఘం వైస్చైర్మన్ నార్లకొండ మల్లమ్మ, హయత్నగర్ సింగిల్ విండో చైర్మన్ చామ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్చారి, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి