
కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
మంచాల: కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన పేరూరి ప్రసన్న కుమార్ శర్మ శుక్రవారం జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్బాబును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపే తానికి శక్తి వంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ప్రసన్నకుమార్ వెంట పార్టీ మండల మాజీ అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, మాజీ సర్పంచ్ సత్తయ్య తదితరులు ఉన్నారు.
30 వరకు బియ్యం పంపిణీ
జిల్లా సివిల్ సప్లై అధికారిణి వనజాతరెడ్డి
బడంగ్పేట్: ఈ నెలాఖరు వరకు మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ ఉంటుందని.. లబ్ధిదారులు తొందరపడాల్సిన అవసరం లేదని జిల్లా సివిల్ సప్లై అధికారిణి వనజాతరెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు రేషన్ దుకాణాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలాపూర్లో రేషన్ దుకాణం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా వనజాతరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 30 వరకు రేషన్ సరఫరా ఉంటుందని వదంతులు నమ్మి తొందరపడొద్దు అన్నారు. ఈ తనిఖీల్లో రేషన్ దుకాణల డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు టేకుల శశిధర్రెడ్డి తదితరులు ఉన్నారు.
రసాయన రహిత
సాగు చేపట్టాలి
జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు
మంచాల: రైతులు సాధ్యమైనంత వరకు రసా యన రహిత సాగు చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. క్రిమి సంహారక మందులు, యూరియా వాడ కం తగ్గించాల్సిన అవసరం అందన్నారు. భూ సార పరీక్షలతో పాటు పంట మార్పిడి చేయాలన్నారు. అనంతరం మంచాల పీఏసీఎస్ చైర్మ న్ హన్మంత్రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయాధి కారుల సలహాలు, సూచనల మేరకు సాగు మె ళకువలు నేర్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అ నంతరం చిత్తాపూర్లోనూ అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాస్, సునీత, రామ్ ప్రకాశ్, పద్మ జ, ఏడీఏ సుజాత, మంచాల ఏఓ కృష్ణమోహ న్, ఏఈఓ నిఖిత, రైతు సంఘం అధ్యక్షుడు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
18 మందికి ‘సీఎంఆర్ఎఫ్’
షాద్నగర్: బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం ఎమ్మెల్సీ నాగర్కుంట నవీన్కుమార్రెడ్డి అందజేశారు. పట్టణంలో ని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 18 బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథ కాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మౌనిక హరికృష్ణ, రామకృష్ణ, తాండ్ర విష్ణువర్ధన్రెడ్డి, బాబురావు, రవీందర్రెడ్డి, జేకే నర్సింలు, రాంచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి

కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయండి