
శానిటేషన్ కార్మికుల భద్రత ముఖ్యం
బడంగ్పేట్: శానిటేషన్ కార్మికులు, సిబ్బంది కోసం భద్రత నైపుణ్యాలు, సామాజిక రక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుశ్మాన్ భారత్ (హెల్త్కార్డు)ను సద్వినియోగం చేసుకోవాలని సీడీఎంఏ డైరెక్టర్ బి.సంధ్య కోరారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా గురువారం మున్సిపల్ కమిషనర్ పి.సరస్వతి, నవజీవ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీడీఎంఏ డైరెక్టర్ సంధ్య మాట్లాడుతూ.. శానిటేషన్ కార్మికుల రక్షణ, భద్రత, చాలా ముఖ్యమని అన్నారు. కార్మికుల నైపుణ్యాలను పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ శ్యామ్సుందర్, డీఈఈ వెంకన్న, ఆర్వో వేణుగోపాల్రెడ్డి, మేనేజర్ నాగేశ్వర్రావు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వంకాయల యాదగిరి, మెప్మా శంకర్, ఈఈ మౌనిక, వార్డు ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది, ఆర్పీలు పాల్గొన్నారు.
‘పట్నం’ మున్సిపాలిటీ సందర్శన
ఇబ్రహీంపట్నం: మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనులను సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ జ్యోత్స్న గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా తడి, పొడి చెత్తపై తీసుకుంటున్న చర్యలను మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య మెరుగు పనులు, నర్సరీలో మొక్కల పెంపకానికి చేపడుతున్న కార్యక్రమాలను ఆమె స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, ప్రణవ్ తదితరులు ఉన్నారు.
సీడీఎంఏ డైరెక్టర్ సంధ్య