10 ప్రైవేటు బస్సుల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

10 ప్రైవేటు బస్సుల సీజ్‌

Jun 13 2025 7:17 AM | Updated on Jun 13 2025 7:17 AM

10 ప్రైవేటు బస్సుల సీజ్‌

10 ప్రైవేటు బస్సుల సీజ్‌

రవాణా శాఖ అధికారుల తనిఖీలు

రాజేంద్రనగర్‌: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా గురువారం రవాణా శాఖ అధికారులు ప్రైవేటు బస్సుల తనిఖీలను ప్రారంభించారు. ఉదయం రాజేంద్రనగర్‌ నియోజకవర్గం పరిధిలోని అప్పా చౌరస్తా, ఆరాంఘర్‌ చౌరస్తా ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 10 బస్సులను గుర్తించి సీజ్‌ చేశారు. ఉదయమే అఽధికారుల బృందం ప్రైవేటు బస్సుల తనిఖీని ప్రారంభించారు. ప్రతి బస్సును ఆపి ధ్రువపత్రాలన్నింటినీ పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులను నమోదు చేశారు. ఈ తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement