స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా యూనిఫాంల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా యూనిఫాంల పంపిణీ

Jun 11 2025 11:50 AM | Updated on Jun 11 2025 11:50 AM

స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా యూనిఫాంల పంపిణీ

స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా యూనిఫాంల పంపిణీ

కడ్తాల్‌: పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫాం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్‌డీఏ ఏపీడీ సూర్యారావు అన్నారు. మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మండల పరిధిలోని పది పాఠశాలలకు సంబంధించి స్కూల్‌ యూనిఫాం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఆర్‌డీఏ ద్వారా మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులచే యూనిఫాంలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 12న పాఠశాలలు ప్రారంభించేలోగా, ఆయా పాఠశాలలకు మొదటి జత అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీపీఎం బాలరాజు, ఎంఈఓ సత్యనారాయణ, ఏపీఎం రాజేశ్వరి, సీసీలు జరీనా, వసంత, నర్సింహ ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న

లోక్‌ అదాలత్‌

చేవెళ్ల: ట్రాఫిక్‌ కేసులకు సంబంధించి చేవెళ్ల కోర్టు ఆవరణలో జరుగుతున్న లోక్‌ అదాలత్‌లో మంగళవారం రెండోరోజు కొనసాగింది. రిటైర్డు జడ్జి కె.లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మొత్తం 169 కేసులు పరిష్కరించారు. రూ.3.78 లక్షల జరిమానా విధించారు. ఇందులో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు 93 కాగా, ఇతర కేసులు 76 ఉన్నాయి. ఈనెల 14వ తేదీ వరకు లోక్‌ అదాలత్‌ కొనసాగుతుందని ట్రాఫిక్‌ సీఐ వెంకటేశం తెలిపారు. చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్‌ మండలాల పరిధిలో కేసులు నమోదైన వారు పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ చందర్‌నాయక్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement