
అక్కసుతోనే దాడులు
పరిగి: ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు, జర్నలిస్టులు, పత్రిక కార్యాలయాలపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎల్హెచ్పీఎస్, భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింగ్నాయక్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సీనియర్ జర్నిలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్రావుపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం అప్రజాస్వామికమని తెలిపారు. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. గత ఏడాది కాలంగా ఏపీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బయటపెడుతోందనే అక్కసుతో సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. ప్రత్రిక స్వేచ్ఛను హరించే కుట్ర చేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాము సిద్ధమని ప్రకటించారు.