రోటావేటర్‌లో ఇరుక్కుని బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

రోటావేటర్‌లో ఇరుక్కుని బాలిక మృతి

Jun 12 2025 11:03 AM | Updated on Jun 12 2025 11:03 AM

రోటావేటర్‌లో ఇరుక్కుని బాలిక మృతి

రోటావేటర్‌లో ఇరుక్కుని బాలిక మృతి

చేవెళ్ల: రోటావేటర్‌ ఓ బాలిక ప్రాణం తీసింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చేవెళ్ల మండలం తంగడపల్లి సమీపంలోని ఫామ్‌హౌస్‌లో కర్ణాటకకు చెందిన సుశీల్‌కుమార్‌, పద్మ దంపతులు పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. పద్మ చెల్లెలు కళావతి, సంజీవ్‌కుమార్‌ కుటుంబం వికారాబాద్‌జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో ఉంటోంది. అక్కను చూసేందుకు కళావతి భర్త, పిల్లలతో కలిసి మంగళవారం తంగడపల్లిలోని తోటకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం మామిడి తోటలో సుశీల్‌కుమార్‌ ట్రాక్టర్‌ రోటావేటర్‌తో దున్నతున్నాడు. అదే సమయంలో కళావతి కూతురు అక్షిత (11) ఆడుకుంటూ వచ్చింది. ప్రమాదవశాత్తు రోటావేటర్‌లో ఇరుక్కొని తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు గమనించి చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంజీవ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement