
శాంతిభద్రతల రక్షణకు చర్యలు
షాద్నగర్రూరల్: శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఏసీపీ లక్ష్మీనారాయణ అన్నారు. పట్టణంతో పాటు ఫరూఖ్నగర్లో మంగళవారం రాత్రి వాహనాల తనిఖీ చేట్టారు. కిరాణా దుకాణాలు, బెల్టుషాపులు, దాబాలు, లాడ్జీలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. నిషేధిత గుట్కాలు, అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అపరిచితులకు దూరంగా ఉండాలని, అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీల్లో పట్టణ సీఐ విజయ్కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ నర్సయ్య, కేశంపేట సీఐ నరహరి, ట్రాఫిక్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు, ఎస్ఓటీ పోలీసులు, పాల్గొన్నారు.
ఏసీపీ లక్ష్మీనారాయణ