ప్రజల పక్షాన ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజల పక్షాన ఉద్యమించాలి

May 29 2025 9:51 AM | Updated on May 29 2025 9:51 AM

ప్రజల పక్షాన ఉద్యమించాలి

ప్రజల పక్షాన ఉద్యమించాలి

● ఉపాధి అవకాశాలు లేకనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నం ● సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బీఎస్‌ఆర్‌ మోహన్‌రెడ్డి

చేవెళ్ల: గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి అవకాశాలు సన్నగించడంతోనే కుటుంబ వ్యవస్థలు ఛిన్నాభిన్నమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యు డు, చైతన్య విజ్ఞాన సమితి కార్యదర్శి బీఎస్‌ఆర్‌ మోహన్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌ కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రాష్ట్ర స్థాయి జన సేవాదళ్‌ శిక్షణ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జన సేవాదళ్‌ రాష్ట్ర కన్వీనర్‌ పంజాల రమేశ్‌ అధ్యక్షతన మూడో రోజు బుధవారం భారత ఆర్థిక వ్యవస్థ–పరిణామాలు అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్‌ఆర్‌ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాల్గవ స్థానానికి తీసుకెళ్లామని గొప్పలు చెబుతున్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించడంలో విఫలమవుతున్నాయని మండిపడ్డారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దేశం అభివృద్ధి చెందుతోందని చెబుతూనే.. 80 కోట్ల మంది పేదలకు రేషన్‌ షాపుల నిత్యావసర సరుకులను అందిస్తున్నామని ప్రకటిస్తున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ విధ్వంసానికి గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదన్నారు. జన సేవాదళ్‌ సభ్యులు ప్రజల పక్షాన ఉద్యమించేందుకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, జాతీయ జన సేవా ఇన్‌స్పెక్టర్‌ మురళి, జి.విష్ణు, గోస్కా మోహన్‌, ఎం.అనిల్‌కుమార్‌, సిద్దినేని కర్ణకుమార్‌, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు రామస్వామి, ప్రభులింగం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయ ణ, నాయకులు సత్తిరెడ్డి, జంగయ్య, మక్బూల్‌, అంజయ్య, శివ, మంజుల, మినాక్షి, బాబురావు, జన సేవాదళ్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement