
ఫ్యూచరా.. ఫార్మానా..?
ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీనా లేక ఫోర్త్ సిటీనా ఫార్మాసిటీనా అనేదానిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేదని మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఫార్మాసిటీతో పాటు జిల్లాలోని వివిధ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్తో కలిసి గురువారం కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్మా కోసం 14వేల ఎకరాల భూములు సేకరించిందని గుర్తు చేశారు. రైతులకు మంచి పరిహారంతో పాటు ఇళ్ల స్థలాలు ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిదారులకు పొజిషన్ చూపించాలన్నారు. పొజిషన్లో ఉండి కాగితాలు లేని రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు. పట్టా భూములు సేకరించిన రైతులకు నేటికీ పరిహారం ఇవ్వలేదని, కలెక్టర్ను అడిగితే కోర్టులో జమ చేశామని చెబుతున్నారని వెంటనే ఆ సమస్య తీర్చాలన్నారు. లేదంటే రైతులకు పట్టా భూములు విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. కబ్జాలో ఉన్న రైతులకు కూడా న్యాయం చేయాలన్నారు. చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారు తప్ప పరిహారం ఇవ్వడం లేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పనులు చేస్తే ఊరుకోబోమని, బలవంతంగా భూసేకరణ చేస్తే సహించబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే ఫార్మా రద్దు చేస్తాం, మీ భూములు మీకిస్తామని చెప్పి మాట తప్పారన్నారు. వెంటనే భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుర్రంగూడ భూసేకరణ సందర్భంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ పొజిషనల్ చూపడం లేదన్నారు.
కాంగ్రెస్ది రెండు నాల్కల ధోరణి
ఫార్మా విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. కోర్టుల్లో ఫార్మా అని ప్రభుత్వం సమర్పించి రైతులకు, ప్రజలకు మాత్రం ఫోర్త్ సిటీ అని చెప్పడం రెండు నాల్కల ధోరణి కాదా అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ రోడ్డుకు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం ఇవ్వకుండానే రోడ్డు ప్రారంభించడం తగదన్నారు. పరిహారం విషయంలో చాలా మందికి అన్యాయం జరిగిందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. రైతులకు అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రమేష్గౌడ్, బాష, రామిడి రాంరెడ్డి, ప్రభాకర్, రాజు నాయక్, గోవర్థన్నాయక్, శేఖర్ గుప్తా, గుర్రం సాయికిరణ్రెడ్డి, హరికిషన్రెడ్డి , రమష్, శ్రీధర్రెడ్డి, అబీబుద్దీన్, బుగ్గరాములు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్పష్టతనివ్వాలి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి