
నర్సింగ్ హోం సీజ్
చేవెళ్ల: ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటనలో చేవెళ్లలోని విజయ్ నర్సింగ్ హోం (ప్రజావైద్యశాల)ను వైద్యాధికారుల బృందం శుక్రవారం సీజ్ చేసింది. మున్సిపల్ పరిధిలోని కేసారం గ్రామానికి చెందిన కల్లెంల నర్సింలుకు విజయ్నర్సింగ్హోంలో ఆపరేషన్ చేశారు. వైద్య వికటించడంతో ఆయన గురువారం మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనల చేపట్టారు. వైద్యాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్యాధికారులు చేవెళ్ల డిప్యూటీ డీఎంహెచ్ఓ వైద్య బృందాన్ని తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు నర్సింగ్ హోంకు వచ్చిన అధికారులు ఆస్పత్రికి తాళం వేసినట్లు గుర్తించారు. ఫోన్ సంప్రదించేందుకు యత్నించినా అందుబాటులోకి రాలేదు. దీంతో వైద్యాధికారుల బృందం ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యాధికారుల విచారణ పూర్తయ్యే వరకు తాళం తీయొద్దని హెచ్చరించారు. గతంలోనూ ఈ నర్సింగ్హోంను వైద్యాధికారులు తనిఖీ చేసిన సమయంలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని నోటీసులు జారీ చేసిన ఇప్పటీ వరకు స్పందించలేదన్నారు. ఈ తనిఖీల్లో మొయినాబాద్ వైద్యాధికారి అన్నపూర్ణ. చేవెళ్ల సబ్సెంటర్ వైద్యురాలు వేదశ్రీ తదితరులు ఉన్నారు.

నర్సింగ్ హోం సీజ్