
ఆలయంలో బంగారు నగల చోరీ
యాచారం: మండల పరిధి నస్దిక్సింగారంలోని సీతారామాంజనేయస్వామి దేవాలయంలో బుధ వారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. దుండగులు దేవాలయంలోని తలుపులను పగులగొట్టి దేవతామూర్తుల మెడలో ఉన్న రూ.లక్ష లోపు విలువ జేసే బంగారు ఆభరణాలు, హుండీలో ఉన్న నగదును అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు గురువారం ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి, ఎస్ఐ మధులు సీతారామాంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి చోరీకి పాల్పడిన తీరును పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు.