
ప్రపంచానికి సైనిక సత్తా చాటాం
షాద్నగర్రూరల్: ఆపరేషన్ సిందూర్తో మన సైనికుల సత్తాను ప్రపంచ దేశాలకు చాటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. మన సైనికులు దేశ ప్రజలకోసం పోరాడుతున్నారన్నారు. పాకిస్తాన్పై భారత సైనికులు చేసింది ఆపరేషన్ మాత్రమేనని యుద్ధం కాదన్నారు. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ కనుమరుగువుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అందె బాబయ్య, శ్రీవర్ధన్రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్రెడ్డి, మహేందర్రెడ్డి, రమేష్, వెంకటేష్గుప్తా, వెంకటేష్, హరిభూషణ్ పటేల్, శ్రీనివాస్రెడ్డి, నాగవర్దన్రెడ్డి, యువసత్తా లక్ష్మణ్కుమార్, శ్రీనివాస చారి, ప్రశాంత్, చంద్రశేఖరప్ప, వరలక్ష్మి, జలజ, శ్రీనివాస్, వంశీ, అశోక్, కుర్మయ్య, మనోహర్, శ్రీకాంత్, శంకర్, మమత తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్ గౌడ్