
అధికంగా పాలిచ్చే పశువుల వివరాలు నమోదు చేయాలి
జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి అరుణశ్రీ
మొయినాబాద్: సురభి చయాన్ శ్రకల కార్యక్ర మంలో భాగంగా పది లీటర్లకు పైగా పాలిచ్చే ఆవులు, గేదెల వివరాలను భారత్ పశుధన్ యాప్లో నమోదు చేయాలని జిల్లా పశు గణనాభివృద్ధి సంస్థ అధికారి డాక్టర్ అరుణశ్రీ గోపాల మిత్రలకు సూచించారు. బుధవారం మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్ మండలాల్లోని గోపాలమిత్ర కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణశ్రీ మా ట్లాడుతూ.. దేశంలో ఎక్కువ పాలిచ్చే జ న్యు వులు ఉన్న ఆవులు, గేదెలను గుర్తించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తద్వా రా పశుపోషకదారులకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తుందన్నారు. గ్రామాల్లో పర్యటించి అధికంగా పాలిచ్చే ఆవులు, గేదెలను గుర్తించి భారత్ పశుధన్ యాప్లో వివరాలను నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో గోపాల మిత్రలు శ్రీనివాస్, యాదయ్య, బాలకిష్టయ్య, విద్యాసాగర్, రాజేశ్, నరేశ్ పాల్గొన్నారు.