
రోడ్డెక్కిన రైతులు
● ఎకరాకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వండి ● లేదంటే డీఎల్ఐ ప్రాజెక్టు రద్దు చేయండి
మాడ్గుల: డిండి లిఫ్ట్ ఇరిగేషన్(డీఎల్ఐ) ప్రాజెక్టు రద్దు చేయాలని కోరుతూ ఇర్విన్, నల్లచెరువు, రెడ్డిపల్లి రైతులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాల్ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా రైతులకు నీరందించేందుకు నిర్మించిన తలపెట్టిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్తో తా ము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.8లక్షల పరిహారం చెల్లిస్తున్నారని..ఆ పరిహారంతో గుంట భూమి దొరికే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఎంత భూమి కోల్పోతే అంత భూమి లేదా ఎకరాకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులకు సమాచారం లేకుండానే పరిహారం జమ చేయడం సరికాదన్నారు. ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదంటూ భీష్మించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి తహసీల్దార్ వినయ్సాగర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.