అంబులెన్స్‌ దగ్ధం | - | Sakshi
Sakshi News home page

అంబులెన్స్‌ దగ్ధం

Jun 8 2025 7:18 AM | Updated on Jun 8 2025 8:49 AM

నెల ర

నెల రోజుల తర్వాత కుటుంబం చెంతకు

గచ్చిబౌలి: అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ మార్చుతుండగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు తెల్పిన వివరాల మేరకు..గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉన్న ఓ రోగి ఆక్సిజన్‌తో తెనాలికి వెళ్లాల్సి ఉండగా సీఎంఎస్‌ అంబులెన్స్‌ను బుక్‌ చేశారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో హాస్పిటల్‌ ఎమర్జెన్సీ ద్వారం వద్ద డ్రైవర్‌ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ సిలిండర్‌ మార్చుతుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఎగసిపడటంతో ఫైర్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అంబులెన్స్‌ పూర్తిగా దగ్ధ్ధమైంది. పరికరాలు, సీట్లు కాలిబూడిదయ్యాయి. హాస్పిటల్‌ సీలింగ్‌కు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా మంటలు ఆర్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రాయదుర్గం పోలీసులు తెలిపారు.

నెల రోజుల తర్వాత కుటుంబం చెంతకు 

యాచారం: మండల పరిధిలోని కుర్మిద్ద గ్రామంలో నెల రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శనివారం కుటుంబ సభ్యుల చెంతకు చేరాడు. హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ సీఐ లిక్కి కృష్ణంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్కాపురం నర్సింహ మే 7న ఇంటి నుంచి పని కోసమని వెళ్లి అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు చుట్టు పక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్ల వద్ద వెతికిన జాడలేకపోవడంతో గ్రీన్‌ ఫార్మాసిటీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్‌ జిల్లాల్లోని పలు చోట్ల వెతికి శనివారం నగరంలోని ఎల్బీనగర్‌ ప్రాంతంలో నర్సింహ సంచరిస్తుండగా గుర్తించి తీసుకొచ్చారు. కుర్మిద్దలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

దైవ దర్శనానికి వెళ్లి..

దుద్యాల్‌: దైవ దర్శనాల కోసం బైక్‌పై బయల్దేరిన ఇద్దరు స్నేహితులు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్‌ జిల్లా దుద్యాల్‌ మండల పరిధిలోని గౌరారం గ్రామానికి చెందిన కమ్మరి జగన్నాథచారి, సరిత దంపతుల కుమారుడు చందుచారి హైదరాబాద్‌లోని వేద పాఠశాలలో చదువుతున్నాడు. నల్లగొండ జిల్లాకు చెందిన శివకుమార్‌ అనే స్నేహితుడితో కలిసి ఇటీవల విహార యాత్రగా బైక్‌పై తిరుపతి, అరుణాచలం బయల్దేరారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో చందు (19) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రగాయాలైన శివకుమార్‌ రేణిగుంట ప్రభుత్వ ఆసస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి వద్ద ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా అక్కడి పోలీసులు శుక్రవారం సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement