
అదుపు తప్పి రేకులషెడ్డును ఢీకొట్టి
● రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం
● మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
ఇబ్రహీంపట్నం: అదుపు తప్పిన బైక్ రేకుల షెడ్ను ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ జగదీశ్ కథనం ప్రకారం.. మంచిర్యాలకు చెందిన రుతికేష్(20) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ పార్టీ అనంతరం స్నేహితుడు సంజయ్ ఉంటున్న మంగల్పల్లి హాస్టల్కు మరో స్నేహితుడు శంకర్తో కలిసి బైక్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి దాటిన తర్వాత శేరిగూడ గాంధీ విగ్రహం వద్దకు రాగానే వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి మెడికల్ షాపు ముందున్న రేకుల షెడ్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రుతికేష్ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన శంకర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.