
పూరి గుడిసె దగ్ధం
కేశంపేట: ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని కాకునూర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కర్రల రమేశ్ కూలీ పనులు చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆమెను తీసుకువచ్చేందుకు శుక్రవారం అత్తగారి ఊరికి వెళ్లాడు. శనివారం ఉదయాన్నే తన గుడిసె కాలిపోయిందని స్థానికులు ఫోన్ చేయడంతో వెంటనే ఇంటికి చేరుకున్నాడు. బాధితుడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
దగ్ధమైన పూరి గుడిసె