
నిరుపేదలకు నాణ్యమైన విద్య
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
మంచాల: నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం ఆయన జిల్లా విద్యాధికారి సుశీందర్రావు, ఎస్డీఎఫ్ సభ్యురాలు పద్మజతో కలిసి మంచాల జెడ్పీహెచ్ఎస్ను సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందడం కష్టతరమైందని.. భవిష్యత్ తరాలకోసం ప్రజల భాగస్వామ్యంతో పాఠశాలలను మరింత అభివృద్ధి దిశగా తీసుకుపోవాలన్నారు. ఈ మేరకు జూన్ 6వ తేదీన మంచాల గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వారి వెంట ఎంఈఓ రాందాస్, ఉపాధ్యాయులు ఉన్నారు.
‘ఉపాధి హామీ’
నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
సీపీఎం కార్యదర్శి పగడాల యాదయ్య
యాచారం: కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. బుధవారం ఆయన చింతపట్ల, నల్లవెల్లి గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ రక్షణ కోసం ఈ నెల 30న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న ధర్నా ను విజయవంతం చేయాలన్నారు. కూలీల పొట్టకొడుతున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కోట్లాది రూపాయల రుణమాఫీ చేస్తోందని మండిపడ్డారు. ఉపాధిహామీ చట్టా న్ని కాపాడకునేందుకు సమష్టి పోరాటం చేయా లని పిలుపునిచ్చారు. వేలాది మంది కూలీలు తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, నాయకులు సత్యం, జంగయ్య, గిరి, శ్రీశైలం, ప్రభాకార్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
విజయలక్ష్మి ఆస్పత్రిపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రిపై మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)కు బాధితుడు గణేశ్ బుధవారం ఫిర్యాదు చేశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఈనెల 4న విజయలక్ష్మి ఆస్పత్రిలో పురిటిలోనే పసికందులు మృత్యువాత పడ్డారని బాధితుడు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి సంబంధిత వైద్యురాలు అనూషరెడ్డిపై చర్యలు తీసుకుని ఆస్పత్రి లైసెన్స్ను రద్దు చేయాలని ముఖ్యమంత్రికి, కలెక్టర్, డీఎంహెచ్ఓలకు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
8న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీ
హిమాయత్నగర్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిన గౌడ్స్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. బుధవారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు బత్తిన అమర్నాథ్ గౌడ్ మాట్లాడారు. మృగశిర కార్తె అయిన జూన్ 8న ఆదివారం ఉదయం 10 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభిస్తామని తెలిపారు. దేశ, విదేశాల నుండి లక్షలాది మంది వస్తుంటారని, ఎవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండా పంపిణీ సజావుగా సాగడానికి ఈ సంవత్సరం ప్రభుత్వం సహకారాన్ని అందిస్తుందని వివరించారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, పోలీస్, విద్యుత్ శాఖలతో పాటు మత్య్సశాఖలతో సమావేశాలు ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నామన్నారు.

నిరుపేదలకు నాణ్యమైన విద్య

నిరుపేదలకు నాణ్యమైన విద్య