
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా
ఇబ్రహీంపట్నం: నల్లకంచె ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో సత్తాచాటారు. సోమవారం వెల్లడించిన ఫలితాల్లో గీతిక 905, నందు 1,956, అక్షయ 5,761, అనూష 2,504, రమ్య శ్రీ 5,416వ ర్యాంక్ సాధించారు. కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది విద్యార్థినులను అభినందించారు.
మెరిసిన గిరిజన తేజం
కేశంపేట: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మండల పరిధిలోని దేవునిగుడితండాకు చెందిన గిరిజన విద్యార్ధిని వి.దీపన్విత ఆల్ ఇండియా 1,248వ ర్యాంక్ సాధించింది. తండాకు చెందిన బాలునాయక్ తన భార్యతో కలిసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమారుడు, కుతూరు ఉన్నారు. కుతూరు దీపన్విత 1వ తరగతిని తండాలోనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివింది. అనంతరం 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు షాద్నగర్ ఇంగ్లిష్ మీడియం పబ్లిక్ స్కూల్లో చదివింది. అనంతరం ఇంటర్మీడియట్ను హైదరాబాద్లోని అల్మాస్గూడలో ఉన్న సంకల్ప్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసింది. ఇంటర్మీడియట్లో 734 మార్కులను సాధించిన దీపన్విత జేఈఈలో (హల్టికెట్ నంబర్ 256125077) ఉత్తమ ర్యాంకు సాధించడంతో కుటుంబ సభ్యులతో పాటు తండావాసులతో అభినందించారు. ఉన్నత చదువులకు దాతలు సహకరించాలని తండ్రి కోరాడు.

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా

జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో గురుకుల బాలికల సత్తా