
నైపుణ్యం కలిగిన యువతతోనే వికసిత భారత్
శంషాబాద్ రూరల్: దేశాభివృద్ధిలో తమ భాగస్వామ్యం ఏమిటో ప్రతి పౌరుడు ఆత్మ విమర్శ చేసుకోవాలి.. నైపుణ్యం కల్గిన యువతరమే వికసిత భారతానికి బాటలు వేయగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ శివారులో ఉన్న స్వర్ణ భారత్ ట్రస్టు ఆవరణలో సోమవారం శిక్షణార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రస్టు శిక్షణార్థులు, భూభరతి లైసెన్స్డ్ సర్వేయర్ల శిక్షణార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు, మహిళలు, యువత అభివృద్ధిపై స్వర్ణ భారత్ ట్రస్టు ప్రధాన దృష్టి పెట్టిందన్నారు. ఒక పూట అన్నం పెట్టడం కాకుండా.. స్వశక్తితో రోజూ ఆహారాన్ని సమకూర్చుకునేలా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. నిత్య జీవితంలో యోగా, ధ్యానం, ఆరోగ్యకర ఆహారాన్ని జీవన విధానంగా చేసుకోవాలని సూచించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భూభారతి చట్టంతో సమస్యలు తొలగాలని ఆకాంక్ష