ఒక్కరి కోసం.. ఆరుగురు | - | Sakshi
Sakshi News home page

ఒక్కరి కోసం.. ఆరుగురు

May 29 2025 9:51 AM | Updated on May 29 2025 9:51 AM

ఒక్కరి కోసం.. ఆరుగురు

ఒక్కరి కోసం.. ఆరుగురు

ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో చివరి రోజు బుధవారం చేవెళ్ల పరీక్ష కేంద్రంలో ఒకే విద్యార్థినితో పరీక్ష కేంద్రం కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆదర్శ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించి చివరి పరీక్ష ఉండగా ఆదర్శ కళాశాలలో ఇద్దరు విద్యార్థులు హాజరుకావాల్సి ఉంది. ఒకే విద్యార్థిని హాజరవడంతో నిబంధనల ప్రకారం చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఇన్విజిలేటర్‌, ఎగ్జామినర్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌, కానిస్టేబుల్‌,ఏఎన్‌ఎం విధులకు హాజరయ్యారు.

– చేవెళ్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement