
తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి
● హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై రైతుల ధర్నా ● సంఘీభావంగా ఆందోళనలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ● పోలీసుల అత్యుత్సాహంతో ఓ రైతుకు అస్వస్థత
ఆమనగల్లు: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆందోళన కారులను పోలీసులు బలవంతంగా స్టేషన్కు తరలించారు. పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు వరి ధాన్యం విక్రయానికి తీసుకువచ్చారు. తేమ ఉండడంతో ధాన్యం కొనుగోలు చేయలేదు. దీంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పలువురు రైతుల ధాన్యం తడిసింది. దీంతో వారు సోమవారం తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వారి ఆందోళనకు సంఘీభావం తెలిపారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలు సుకున్న ఆమగనల్లు సీఐ జానకిరాంరెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్, సీతారాంరెడ్డి సిబ్బంది ఆందోళన విరమించాలని రైతులకు నచ్చజెప్పినా వినలేదు. ఆందోళనకారులను పక్కకు తొలగించిన పోలీసులకు బీఆర్ఎస్ నాయకులను స్టేషన్కు తరలించారు. దీంతో బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు పత్యానాయక్ స్టేషన్ ఆవరణలోనే నిరసనదీక్ష చేపట్టాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కడ్తాల్ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్నాయక్, సింగిల్ విండో చైర్మన్ వెంకటేశ్, మాజీ సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, కడ్తాల, ఆమనగల్లు బీఆర్ఎస్ అధ్యక్షులు పరహేశ్, అర్జున్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి స్టేషన్కు చేరుకున్నారు. పత్యానాయక్ దీక్ష విరమింపజేసిన జైపాల్యాదవ్ మార్కెట్ యార్డుకు చేరుకుని రైతులతో మాట్లాడు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
పోలీసుల అత్యుత్సాహం
జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్నవారిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ రైతు ను ఆమనగల్లు సీఐ జానకిరాంరెడ్డి, పోలీసులు బలవంతంగా లేపి పక్కన పడేయడంతో ఆ రైతు అస్వస్థతకు గురికావడంతో ఒకింత ఉద్రిక్తత నెలకొంది. పలువురు ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు.