
నక్సలిజం ఒక సిద్ధాంతం
ఘనంగా తిరంగా
ఆపరేషన్ సిందూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. దేశరక్షణకు ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు అంజలి ఘటిస్తూ ఆమనగల్లు పట్టణంలో సోమవారం తిరంగా ర్యాలీ చేపట్టారు.
– ఆమనగల్లు
చేవెళ్ల: నక్సల్ ఫ్రీ ఇండియా అనేది ఔట్డేటెడ్ మాట అని కేంద్ర మంత్రి అనడం సరికాదని.. నక్సల్స్తో శాంతి చర్చలు జరపడమే పరిష్కారమార్గమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పట్టణంలోని సత్యసాయి పాఠశాల ఆవరణలో సోమవారం ఆయన సీపీఐ జనసేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీపీఐ వందేళ్ల పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా 50 వేల మంది జన సేవాదళ్ కార్యకర్తలను సిద్ధం చేయాలనే లక్ష్యంతో పార్టీ ముందుకెళ్తోందని తెలిపారు. పేదల ఉద్యమాన్ని, పార్టీని రక్షించుకునేందుకు వీరు సైనికుల్లా పనిచేస్తారన్నారు. నక్సలిజం అనేది ఒక సిద్ధాంతమని.. ఎంతమందిని చంపినా అంతకు మించి పుట్టుకొస్తారని తెలిపారు. దీన్ని తీవ్రవాద సమస్యగా పరిగణించకూడదని సూచించారు. టెర్రరిస్టులు, పాకిస్తాన్ వంటి విదేశీయులతో శాంతిచర్చలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం నక్సల్స్తో శాంతి చర్చలకు ముందుకు రాకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ తుపాకీ, నక్సల్ తుపాకీ వల్ల సమస్యలు పరిష్కారం కావని, వెంటనే అడవుల్లో సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు హేమంతరావు, జనసేవ రాష్ట్ర కన్వీనర్ రమేశ్, రాష్ట్ర నాయకులు మోహన్, అనిల్కుమార్, శంకర్, ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగయ్య, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు నర్సింగ్రావు, రాష్ట్ర సమితి సభ్యులు పి.పర్వతాలు, కె.రామస్వామి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభులింగం, సత్యనారాయణ, నాయకులు సత్తిరెడ్డి, చందు, బాతరాజు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
తీవ్రవాద సమస్యగా పరిగణించొద్దు
కేంద్రం వెంటనే కాల్పుల విరమణప్రకటించాలి
జన సేవాదళ్ శిక్షణ శిబిరంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

నక్సలిజం ఒక సిద్ధాంతం