తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి

May 27 2025 7:35 AM | Updated on May 27 2025 7:35 AM

తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి

తిరంగా ర్యాలీని విజయవంతం చేయండి

షాద్‌నగర్‌రూరల్‌: ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం అయిన సందర్భంగా ఈ నెల 28న పట్టణంలో నిర్వహించనున్న తిరంగా ర్యాలీని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సమామేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్‌రెడ్డి, అందె బాబయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. పహల్గాం దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రావాద శిబిరాలను మట్టుబెట్టి మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటిందన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన సందర్భంగా బుధవారం పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి శివాజీ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ ర్యాలీకి పట్టణ ప్రజలు పె ద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరా రు.ఈ సమావేశంలో నాయకులు వెంకటేష్‌ గుప్తా, అశోక్‌, వంశీకృష్ణ, మురళి, శ్రీనివాస్‌, హరిభూషణ్‌, సురేశ్‌, రాధిక, రాజు, రణధీర్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, మ హేందర్‌రెడ్డి,నర్సింహ,కుర్మయ్య,రఘురాం,శంకర్‌ ,నర్సింలు, మహేశ్‌, గణేశ్‌, హన్మంతు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీవర్ధన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement