
తొలి తెలుగు కవయిత్రి మొల్ల
ఆమనగల్లు: తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ అని, ఆమె రచించిన రామాయణం సామాన్య ప్రజలకు అర్థమయ్యేరీతిలో ఉందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొల్లమాంబ విగ్రహాన్ని ఆదివారం ఆ సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే కసిరెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారిలు ఆవిష్కరించారు. ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాల్మీకి రాసిన సంస్కృత రామాయణాన్ని.. మొల్లమాంబ తెలుగులోకి సరళమైన భాషలో అనువదించారని పేర్కొన్నారు. దీంతో శ్రీ కృష్ణ దేవరాయలు మొల్లకు కవిరత్న బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. కుమ్మరి కుటుంబంలో పుట్టిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయంత్రావ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద్, రాష్ట్ర కోశాధికారి రాజలింగం, నాయకులు తిరుమలవెంకటేశం, వీరేశం, సాయిలు, గోవర్ధన్, నరేశ్, దుర్గాపురం నగేశ్, వెంకటేశ్, మల్లేశ్, బాలయ్య, గణేశ్, మోహన్కుమార్, సుధాకర్, వీరయ్య, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
మొల్లమాంబ విగ్రహావిష్కరణ