అర్జీలు 1600.. అర్హులు 60 | - | Sakshi
Sakshi News home page

అర్జీలు 1600.. అర్హులు 60

May 26 2025 7:33 AM | Updated on May 26 2025 7:33 AM

అర్జీలు 1600.. అర్హులు 60

అర్జీలు 1600.. అర్హులు 60

కడ్తాల్‌: ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో నిరుపేదలను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కడ్తాల్‌ మాజీ సర్పంచ్‌ గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి ఆరోపించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఉప సర్పంచ్‌ రామకృష్ణ, మైనార్టీ నాయకులు లాయక్‌అలీతో కలిసి ఆయన మాట్లాడారు. కడ్తాల్‌ గ్రామంలో సుమారు 1600 మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా.. 60 మందిని మాత్రమే అర్హులుగా పేర్కొంటూ లబ్ధి చేకూర్చారని పేర్కొన్నారు. తిరస్కరణకు గురైన వారి వివరాలు, మిగతా వారు ఎంపిక కాకపోవడానికి కారణాలేమిటో పంచాయతీ కార్యాలయంలో బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు, ఇందిరమ్మ పేరుతో మరో కొత్త నాటాకానికి తెరలేపారని విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలులో సర్కారు పూర్తిగా విఫలమైందని, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అట్టడుగు స్థాయికి తెలంగాణ దిగజారిపోయిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాంచంద్రయ్య, ఇర్షాద్‌, వెంకటేశ్‌, నాగార్జున్‌, మహేశ్‌, కృష్ణ, మహేశ్‌, భాస్కర్‌, మహేశ్‌ నాయక్‌ ఉన్నారు.

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

మాజీ ప్రజాప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement