కుర్మిద్దలో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

కుర్మిద్దలో ఉద్రిక్తత

May 4 2025 8:14 AM | Updated on May 4 2025 8:14 AM

కుర్మిద్దలో ఉద్రిక్తత

కుర్మిద్దలో ఉద్రిక్తత

యాచారం: కుర్మిద్ద గ్రామంలో టీజీఐఐసీ, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కుర్మిద్ద–నస్దిక్‌సింగారం గ్రామాల మధ్య కోర్టు కేసులున్న ఫార్మా పట్టా భూముల్లో శనివారం చదును పనులు చేపట్టారు. టీజీఐఐసీ అధికారులు జేసీబీలు తెచ్చి చెట్లు తొలగించడం, భూమిని చదును చేసి బౌండరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి వెళ్లి అభ్యంతరం తెలిపారు. కోర్టు కేసులున్న భూముల్లో పనులు ఎలా చేపడతారంటూ అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న హైదరాబాద్‌ గ్రీన్‌ ఫార్మాసిటీ ఎస్‌ఐ తేజంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని రైతులు, టీజీఐఐసీ అధికారులతో మాట్లాడారు. కోర్టు కేసులున్న భూముల్లో రైతులు అభ్యంతరం తెలిపితే పనులు చేపట్టవద్దని టీజీఐఐసీ అధికారులకు సూచించారు. ఎస్‌ఐ సూచన మేరకు టీజీఐఐసీ అధికారులు అక్కడి నుంచి జేసీబీలను తీసుకెళ్లడంతో రైతులు శాంతించారు.

కోర్టు కేసులున్న భూముల్లో పనులు ప్రారంభించిన టీజీఐఐసీ అధికారులు

అడ్డుకున్న రైతులు

పనులు నిలిపేసిన గ్రీన్‌ ఫార్మాసిటీ ఎస్‌ఐ తేజంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement