దంత వైద్యుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

దంత వైద్యుడి ఆత్మహత్య

May 1 2025 7:30 AM | Updated on May 1 2025 7:30 AM

దంత వ

దంత వైద్యుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలే కారణం

షాద్‌నగర్‌: కుటుంబ కలహాలతో షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన ఓ వైద్యుడు బుధవారం హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సాయిబాబా కాలనీకి చెందిన కొమ్ము వెంకన్నబాబు మూడో కుమారుడు డాక్టర్‌ మహర్షి (35) తన భార్య డాక్టర్‌ రజితతో కలిసి బేగంపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. భార్యాభర్తలు ఇద్దరూ డెంటిస్ట్‌లే. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన మహర్షి బుధవారం నగరంలోని ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని షాద్‌నగర్‌కు తరలించే ఏర్పాట్లలో ఉన్నట్లు తెలిపారు.

గోల్ఫ్‌ అసోసియేషన్‌ కేసు సీసీఎస్‌కు బదిలీ

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌లో (హెచ్‌జీఏ) నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి గోల్కొండ ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ అయింది. అసోసియేషన్‌కు చెందిన సీనియర్‌ సభ్యుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 16న గోల్కొండ ఠాణాలో ఈ కేసు నమోదైంది. రూ.1.7 కోట్లకు సంబంధించిన కాంట్రాక్టును అవసరమైన విధానాలు పాటించకుండా కట్టబెట్టారని, రూ.50 లక్షలు అడ్వాన్స్‌గా చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. ఇందులో హెచ్‌జీఏ ప్రెసిడెంట్‌, సెక్రటరీ సహా కీలక సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో దీని దర్యాప్తును సీసీఎస్‌కు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. గోల్కొండ ఠాణా నుంచి వచ్చిన కేసును రీ–రిజిస్టర్‌ చేసిన సీసీఎస్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

దాడి కేసులో

ఒకరికి ఏడాది జైలు

కొడంగల్‌: మండల పరిధిలోని బూల్కాపూర్‌ గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి కొడంగల్‌ మున్సిపల్‌ కోర్టు న్యాయమూర్తి ఏడాది జైలు శిక్ష విధించారు. 2020లో జరిగిన ఇంటి గొడవలో శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డిపై అప్పటి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత కొడంగల్‌ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారు. శ్రీనివాస్‌రెడ్డి తలపై రాడ్డుతో కొట్టి దాడి చేసినందుకు సత్యనారాయరెడ్డికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో

టీబీ టీకాలు

కుల్కచర్ల: టీబీ హౌజ్‌ హోల్డ్‌ సభ్యులకు టీకాలు ఇచ్చామని కుల్కచర్ల వైద్యాధికారి కిరణ్‌ గౌడ్‌ చెప్పారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీబీ కోఆర్డినేటర్‌ రాజు ఆధ్వర్యంలో వ్యాధిగ్రస్తులకు టీకాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇళ్లలోని ఇతర వ్యక్తులకు వ్యాధి సోకకుండా వారికి టీకాలు ఇచ్చామని తెలిపారు. టీబీ లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు మాధవి, మహేశ్వరి, టీబీ సూపర్‌వైజర్‌ గోపాల్‌, వైద్య సిబ్బంది సుజాత, సీనబాయి, నవీన్‌, సిరాజ్‌ పాల్గొన్నారు.

సుదీర్ఘ సేవలు అభినందనీయం

అనంతగిరి: విధి నిర్వహణలో మనం ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ కార్యాలయంలో వికారాబాద్‌ మహిళ పీఎస్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన ఎండీ హాషంకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘంగా సేవలు అందించడం గొప్ప విషయమన్నారు. 41 ఏళ్ల పాటు విధులు చేపట్టారన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ వీరేష్‌, ఏఓ జ్యోతిర్మణి, ఉమెన్స్‌ పీఎస్‌ సీఐ శివచంద్ర, ఆర్‌ఐలు, జిల్లా పోలీసు ప్రెసిడెంట్‌ అశోక్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

దంత వైద్యుడి ఆత్మహత్య 1
1/1

దంత వైద్యుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement