పల్లె పోరు బహుముఖం | - | Sakshi
Sakshi News home page

పల్లె పోరు బహుముఖం

Dec 17 2025 10:05 AM | Updated on Dec 17 2025 10:05 AM

పల్లె

పల్లె పోరు బహుముఖం

● నేడు చివరి విడత పంచాయతీ ఎన్నికలు ● 80 సర్పంచ్‌ స్థానాలకు 380 మంది పోటీ ● 551 వార్డుల్లో 1,639 మంది అభ్యర్థులు ● ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌

మండలాల వారీగా ఎన్నికల స్వరూపం

సిరిసిల్ల: జిల్లాలోని తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలు బుధవారం జరుగనున్నాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లోని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. పల్లెల్లో ఎన్నికల పోరు బహుముఖంగా సాగుతుంది. ఆఖరు విడత 80 గ్రామాల్లో సర్పంచు స్థానాలకు 380 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, 551 వార్డుసభ్యుల స్థానాలకు 1,639 మంది బరిలో ఉన్నారు. తుదివిడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 87 గ్రామాలకు, 762 వార్డులకు ఎన్నికల షెడ్యూల్‌ జారీ కాగా.. నామినేషన్ల పర్వం ముగిసే నాటికి ఏడు సర్పంచులు, 211 వార్డుమెంబర్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన గ్రామాల్లో బుధవారం జరిగే ఎన్నికలకు 914 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,244 మంది సిబ్బందిని నియమించారు. నాలుగు మండలాల్లోని 1,27,920 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మహిళా ఓటర్లే అధికం

జిల్లాలోని తుది విడత ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. గంభీరావుపేట మండలంలో 17,811 మంది పురుషులు, 18,996 మహిళలు, ముస్తాబాద్‌ మండలంలో 18,658 మంది పురుషులు, మహిళా ఓటర్లు 19,842 ఉన్నారు. వీర్నపల్లి మండలంలో 5,769 మంది పురుషులు, 5,958 మంది మహిళలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 19,690 మంది పురుషులు, 21,196 మహిళా ఓటర్లు ఉన్నారు.

పల్లెలకు తరలిన అధికారులు

ఎన్నికలు జరిగే పల్లెలకు మంగళవారం సాయంత్రం ప్రిసైడింగ్‌ అధికారులు, ఓపీఓలు తరలివెళ్లారు. ఎన్నికల సామగ్రి, అధికారులు, సిబ్బందిని వాహనాల్లో తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఏడు జోన్లు, పది రూట్లు ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండలంలో ఐదు జోన్లు, పది రూట్లు, ముస్తాబాద్‌ మండలంలో నాలుగు జోన్లు, ఎనిమిది రూట్లు, వీర్నపల్లి మండలంలో రెండు జోన్లు, ఐదు రూట్లతో ఎన్నికల ప్రణాళిక రూపొందించారు.

సమస్యాత్మక పల్లెల్లో కట్టుదిట్టమైన భద్రత

ఎన్నికలు జరిగే నాలుగు మండలాల్లో 32 సమస్యాత్మక గ్రామాలు ఉండగా, వీటిలో 14 అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించారు. గత ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో జరిగిన గొడవలను అంచనా వేస్తూ పోలీసులు పటిష్ట రక్షణ ఏర్పాట్లు చేశారు.

ఉదయం 7 గంటల నుంచే..

బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ మొదలై మధ్యాహ్నం 1 గంటలోగా ముగుస్తుంది. భోజన విరామం తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. లెక్కింపు పూర్తి కాగానే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు. ఆఖరు విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అఽధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

గంభీరావుపేట

గ్రామాలు: 22

ఓటర్లు: 36,807

ఏకగ్రీవమైన

గ్రామాలు: 03

ఎన్నికలు జరిగేవి:

19

బరిలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థులు: 92

వార్డు సభ్యుల

అభ్యర్థులు: 491

పోలింగ్‌ సిబ్బంది:

577

ముస్తాబాద్‌

గ్రామాలు: 22

ఓటర్లు: 38,500

ఏకగ్రీవమైన

గ్రామాలు: 01

ఎన్నికలు జరిగేవి:

21

పోటీలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థులు: 95

వార్డు సభ్యుల

అభ్యర్థులు: 494

పోలింగ్‌ సిబ్బంది:

603

వీర్నపల్లి

గ్రామాలు: 17

ఓటర్లు: 11,727

ఏకగ్రీవమైన

గ్రామాలు: 01

ఎన్నికలు జరిగే

గ్రామాలు: 16

పోటీలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థులు: 73

వార్డు సభ్యుల

అభ్యర్థులు: 137

పోలింగ్‌ సిబ్బంది:

318

ఎల్లారెడ్డిపేట

గ్రామాలు: 26

ఓటర్లు: 40,886

ఏకగ్రీవమైన

గ్రామాలు: 02

ఎన్నికలు జరిగే

గ్రామాలు: 24

పోటీలో ఉన్న సర్పంచ్‌ అభ్యర్థులు: 120

వార్డు సభ్యుల

అభ్యర్థులు: 517

పోలింగ్‌ సిబ్బంది:

660

పల్లె పోరు బహుముఖం1
1/3

పల్లె పోరు బహుముఖం

పల్లె పోరు బహుముఖం2
2/3

పల్లె పోరు బహుముఖం

పల్లె పోరు బహుముఖం3
3/3

పల్లె పోరు బహుముఖం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement