అవగాహనే ఔషధం | - | Sakshi
Sakshi News home page

అవగాహనే ఔషధం

Dec 1 2025 7:20 AM | Updated on Dec 1 2025 7:38 AM

● జిల్లాలో తగ్గుతున్న ఎయిడ్స్‌ బాధితులు ● విస్తృతంగా అవగాహన కలిగి ఉండటమే కారణం ● నేడు ప్రపంచ ఎయిడ్స్‌ అవగాహన దినం

● జిల్లాలో తగ్గుతున్న ఎయిడ్స్‌ బాధితులు ● విస్తృతంగా అవగాహన కలిగి ఉండటమే కారణం ● నేడు ప్రపంచ ఎయిడ్స్‌ అవగాహన దినం

సిరిసిల్ల/కరీంనగర్‌: ఎయిడ్స్‌ అంటే భయం. ఈ వ్యాధి ఒక్కసారి వచ్చిందంటే చాలు శరీరాన్ని వదిలివెళ్లదు. మందులు వాడితే నియంత్రణలో ఉంటుంది. కానీ ఆదమరిస్తే తిరగబెట్టి కబళించేస్తుంది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరిగి క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటుచేసింది. ఫలితంగా జిల్లాలో కొన్నేళ్లుగా ఎయిడ్స్‌ తగ్గుముఖం పడుతోంది. గతంలో కన్నా ప్రస్తుతం కేసులు తక్కువగా కనిపిస్తున్నా జిల్లాలో అధికారికంగానే ప్రతీ నెల 20కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అనధికారికంగా చాలా మంది వ్యాధిబారిన పడుతున్నట్లు తెలుస్తోంది. జి ల్లాలో ప్రస్తుతం 1,385 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.

అవగాహన ముఖ్యం

హెచ్‌ఐవీ అని తెలియగానే సీడీ–4 కణాల సంఖ్య తగ్గేంత వరకూ అశ్రద్ధ చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో ఆధునిక వైద్యసేవలు పొందితే 75 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవనం సాగించొచ్చు. ఎయిడ్స్‌ రోగులూ మధుమేహం, బీపీ, ఆస్తమా రోగుల మాదిరిగానే ఔషధాల వాడకం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు. హెచ్‌ఐవీ ఉన్న దంపతులు తగిన సమయంలో ఏఆర్టీ మందులు వాడి ఆ రోగం లేని పిల్లలకు జన్మనివ్వొచ్చు.

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి

హెచ్‌ఐవీ బాధితులు ఉదయం 3 కిలోమీటర్లు నడి చి, 15 నిమిషాలపాటు ధ్యానం చేయాలి. గ్లాస్‌ పా లు, బ్రెడ్‌, ఉడికించిన గుడ్డు తీసుకోవాలి. రోజు రా గిజావా, అంబలి తాగాలి. మధ్యాహ్నం భోజనంలో తాజా కూరగాయలు, ఆలుదుంపలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, నాన్‌వెజ్‌ తీసుకోవాలి. సాయంత్రం ఆపిల్‌, దానిమ్మ, అంగూర, అరటిపండ్లు, ఫైనాపిల్‌, సపోట తినాలి. గోధుమ రవ్వ పాలలో కలిపి ఉడికించి ఆరగించాలి. రాత్రి భోజనంలో తాజా కూరగాయలు, రెండు చపాతీలు, నిద్రించే సమయంలో వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి.

ఎయిడ్స్‌ బారిన యువత

హెఐవీ కేసుల్లో యువత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారే 70 శాతం వరకు హెఐవీ వ్యాధి బారిన పడుతున్నారు. మద్యానికి బానిస కావడం, మత్తు పదార్థాలు సేవించడం, సురక్షితం లేని శృంగారంలో పాల్గొనడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడవమేనని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో హైరిస్క్‌ ప్రవర్తన గల వ్యక్తులు, ఫీమేల్‌ సెక్స్‌ వర్కర్లు, స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌ జెండర్ల తరఫున స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ వారి ప్రవర్తనలో మార్పునకు యత్నిస్తున్నాయి. మంచి మందులు అందుబాటులో ఉండడంతో మరణాల సంఖ్య తగ్గింది.

గతేడాది స్టేట్‌ అవార్డు

ఎయిడ్స్‌ నిర్మూలనకు విస్తృతంగా చేపడుతున్న కార్యక్రమాలతో కరీంనగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో నిలవడంతో గతేడాది స్టేట్‌ అవార్డు వచ్చింది. వ్యాధి నియంత్రణలో ఉంచేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలను గుర్తించి అవార్డు అందజేశారు. హెచ్‌ఐవీ బాధితులకు ఏఆర్‌టీ సెంటర్‌ ద్వారా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. వారికి కావాల్సిన మందులు ఇవ్వడంతో పాటు సీడీ–4, వైరల్‌ లోడ్‌ పరీక్షలు ఎప్పటికప్పుడు చేస్తున్నాం. హెచ్‌ఐవీ నియంత్రణ మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి.

– సదానందాచారి, ఐసీటీసీ కౌన్సెలర్‌, కరీంనగర్‌

అవగాహనే ఔషధం1
1/1

అవగాహనే ఔషధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement