
తరగతికి ఒక టీచర్ను నియమించాలి
విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ఖాళీలను భర్తీ చేయాలి. శాసీ్త్రయమైన హేతుబద్ధీకరణ జరగాలి. ప్రాథమిక పాఠశాలల్లో కనీసం తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు పనిభారం పెరుగుతోంది. వివిధ తరగతుల విద్యార్థులకు ఒకేసారి బోధించడం సాధ్యం కాదు. విద్యాప్రమాణాలు తగ్గుతాయి. – పాతూరి మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు
విద్యారంగం బలోపేతంపై దృష్టి పెట్టాలి
విద్యారంగంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బడుల్లో ఉపాధ్యాయులు లేక విద్యాబోధన కుంటుపడుతోంది. జిల్లాలో దూరంగా ఉన్న గంభీరావుపేట మండలంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థుల చదువుకు ప్రాధాన్యతనిస్తూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.
– దోసల శంకర్, గంభీరావుపేట

తరగతికి ఒక టీచర్ను నియమించాలి