కలెక్టరేట్‌లో ఫైల్స్‌ పెండింగ్‌లో లేవు | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ఫైల్స్‌ పెండింగ్‌లో లేవు

Apr 16 2025 11:10 AM | Updated on Apr 16 2025 11:10 AM

కలెక్

కలెక్టరేట్‌లో ఫైల్స్‌ పెండింగ్‌లో లేవు

సిరిసిల్ల: కలెక్టరేట్‌లో ఎటువంటి ఫైల్స్‌ పెండింగ్‌లో లేవని, సకాలంలో అన్నీ పరిష్కరిస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ‘కలెక్టర్‌.. అన్నీ అదనపు బాధ్యతలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన కథనంపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అదనపు బాధ్యతలు స్వీకరించానని ఆయన వివరించారు. జిల్లాలోని అన్ని శాఖల ఫైల్స్‌ ఎప్పటికప్పుడు క్లియర్‌ అవుతున్నాయని, ప్రస్తుతం ‘ఈ–ఆఫీస్‌’లో ఎటువంటి ఫైల్స్‌ పెండింగ్‌లో లేవని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవో బదిలీ..?

సిరిసిల్ల: జిల్లాలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తూ, సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవోగా ఉన్న రాధాబాయి హైదరాబాద్‌ టీఎస్‌ఐసీసీకి బదిలీ అయినట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలు రాగా, ఆమెను రిలీవ్‌ చేయకుండా ఆపివేసినట్లు తెలిసింది. ఇప్పటికే వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్‌ దీర్ఘకాలిక సెలవులో వెళ్లగా, ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. సిరిసిల్ల ఆర్డీవోగా సైదులును ప్రభుత్వం బదిలీ చేయగా ఆయన విధుల్లో చేరలేదు. సిరిసిల్ల ఇన్‌చార్జి ఆర్డీవోగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌డీసీ రాధాబాయి బదిలీ అంశం రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే జిల్లాలో కీలకమైన పోస్టులన్నీ ఇన్‌చార్జి అధికారులతో కొనసాగుతుండగా, ఇన్‌చార్జి ఆర్డీవో బదిలీ కావడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. బదిలీ విషయమై రాధాబాయిని వివరణ కోరగా.. తనకు బదిలీ కాలేదని సమాధానమిచ్చారు. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆమె అలా సమాధానమిచ్చి ఉంటారని కలెక్టరేట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

సమయపాలన పాటించాలి

బోయినపల్లి(చొప్పదండి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని డీఎంహెచ్‌వో రజిత ఆదేశించారు. మండలంలోని కొదురుపాక పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి రికార్డులు, సిబ్బంది హాజరు రిజిష్టరు, మందులను పరిశీలించారు. వైద్యాధికారి రేణు ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

సిరిసిల్లకల్చరల్‌: క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ఆసక్తి, అర్హత గల క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడల శాఖ అధికారి అజ్మీరరాందాస్‌ తెలి పారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చే యనున్న 10 శిబిరాల్లో మే 1 నుంచి నెల రోజు లపాటు 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఉత్సాహవంతులైన సీనియర్‌ క్రీడాకారులు, జాతీయస్థాయి క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు అర్హులుగా పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని క్రీడల శాఖ కార్యాలయంలో ఈ నెల 22 లోపు తమ ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ఎంపికై న శిక్షకులకు గౌరవ వేతనం, క్రీడా సామగ్రి అందజేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94402 39783 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

అగ్నివీర్‌ ఎంపికకు..

సిరిసిల్లకల్చరల్‌: భారత సైనికాదళంలో వివిధ కేటగిరీల వారీగా అగ్నివీర్‌ జనరల్‌, టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌, ట్రేడ్స్‌మెన్‌ తదితర పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదలైనట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్‌ తెలిపారు. అభ్యర్థుల అర్హత ఆధారంగా ఏవైనా రెండు కేటగిరీల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ సర్టిఫికెట్లు ఉన్నవారికి బోనస్‌ మార్కులు ఇస్తారని పేర్కొన్నారు. 13 భాషల్లో నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారని వివరించారు. అర్హతగల యువత ww. joinindianarmy. nic ద్వారా ఆన్‌లైన్‌లో ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జూన్‌లో సంబంధిత సైట్‌ నుంచి అడ్మిట్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరు కావచ్చని పేర్కొన్నారు. ప్రతిభ ఆధారితంగా జరిగే ఎంపిక ప్రక్రియలో సందేహాలున్న వారు సికింద్రాబాద్‌ లోని రిక్రూటింగ్‌ కార్యాలయం ఫోన్‌ నంబర్‌లో (040–27740205)సంప్రదించాలని సూచించారు.

కలెక్టరేట్‌లో ఫైల్స్‌   పెండింగ్‌లో లేవు
1
1/2

కలెక్టరేట్‌లో ఫైల్స్‌ పెండింగ్‌లో లేవు

కలెక్టరేట్‌లో ఫైల్స్‌   పెండింగ్‌లో లేవు
2
2/2

కలెక్టరేట్‌లో ఫైల్స్‌ పెండింగ్‌లో లేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement