ఆడిటింగ్‌కు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఆడిటింగ్‌కు సిద్ధంగా ఉండాలి

Mar 29 2025 12:16 AM | Updated on Mar 29 2025 12:14 AM

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఈనెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో జిల్లాలోని అన్ని గ్రామాల సంఘాల పుస్తకాలు రాసి ఆడిటింగ్‌కు సిద్ధంగా ఉండాలని ఐకేపీ డీపీఎం పద్మయ్య సూచించారు. మండల కేంద్రంలోని కావేరి మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం వీఏవోలతో సమావేశమయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన పద్మయ్య మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో ఆర్థిక లావాదేవీలపై మహాసభలు ఏర్పాటు చేయాలన్నారు. మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారంపై మహిళలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏపీఎం మల్లేశం, మండల సమాఖ్య అధ్యక్షురాలు బైరి జ్యోతి, కార్యదర్శి మీన, కోశాధికారి రమ, సీసీలు మంగ్యానాయక్‌, దేవేందర్‌, నాగరాజు, సుధాకర్‌, రమణ, పద్మ పాల్గొన్నారు.

ఐకేపీ డీపీఎం పద్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement