సిరిసిల్లటౌన్: తమ తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని బొంగులకింది తండా ప్రజలు కోరారు. మంగళవారం కలెక్టరేట్కు తరలొచ్చి ధర్నా చేపట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ను తమ తండాను ప్రత్యేక పంచాయతీగా చేయాలని కోరగా ప్రపోజల్ పంపినట్లు ప్రకటించారన్నారు. కానీ, అదే పార్టీలోని కొందరు తమ స్వార్థం కోసం రాజ్నాయక్ తండాతో పాటు తమ తండాను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి తాము రాజ్నాయక్ తండా జీపీలో ఉండటం లేదని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం పంచాయతీ ఆఫీస్ను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారని, ఈ క్రమంలో తమ డిమాండ్ను గుర్తించి తమ తండాను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని బి. శ్రీనివాస్, భాస్కర్ తదితరులు కోరారు. ఈమేరకు కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.