ఆలకించి.. ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించి.. ఆదుకోండి

May 26 2025 11:56 PM | Updated on May 26 2025 11:56 PM

ఆలకించి.. ఆదుకోండి

ఆలకించి.. ఆదుకోండి

● ప్రజావాణిలో వినతుల వెల్లువ ● అర్జీలు వెంటనే పరిష్కరించాలి ● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ● వివిధ సమస్యలపై 182 దరఖాస్తులు

సిరిసిల్ల: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి భారీగా బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాకు వినతిపత్రాలు అందించారు. జిల్లాలోని నలువైపుల నుంచి తరలివచ్చిన బాధితులు దాదాపు 182 మంది అర్జీలు అందించారు. రెవెన్యూశాఖకు 75, హౌసింగ్‌కు 36, ప్రత్యేక ఉపకలెక్టర్‌కు 12, డీఆర్డీవో, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌లకు 9 చొప్పున, ఎస్పీ ఆఫీస్‌కు 6, జిల్లా ఉపాధి కల్పన అధికారి, నీటిపారుదల శాఖలకు 5 చొప్పున, జిల్లా సంక్షేమాధికారికి 4, వ్యవసాయశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారి, చేనేత, జౌళిశాఖ, సబ్‌ రిజిస్ట్రార్‌, ఏడీ భూసర్వే శాఖలకు రెండు చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని, లేదా.. బాధితులకు సమాధానం ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీఎంహెచ్‌వో రజిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement