చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు
చందుర్తి(వేములవాడ): గంజాయి నిర్మూలనకు పోలీస్శాఖ ఉక్కుపాదం మోపుతోందని చందుర్తి సీఐ గాండ్ల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. చందుర్తి సర్కిల్ ఆఫీస్లో గంజాయి కేసులలో నిందితులకు బుధవారం సీఐ కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ నిందితులు తమ ప్రవృత్తిని మార్చుకోవాలని సూచించారు. లేకపోతే హిస్టరీషీట్స్, పీడీయాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పాత నేరస్తులపై నిఘా ఉంటుందని తెలిపారు. గంజాయి సేవించిన, రవాణా చేసిన, క్రయవిక్రయాలు కొనసాగించిన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి పరీక్షలు నిర్వహణకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి సహకారంతోనే రవాణాదారులను, విక్రయదారులను పట్టుకుంటామని వివరించారు. చందుర్తి ఎస్సై అంజయ్య, ప్రొబేషనరీ ఎస్సై అనిల్కుమార్, సిబ్బంది ఉన్నారు.