● డీఎంహెచ్వో రజిత
సిరిసిల్ల/బోయినపల్లి/తంగళ్లపల్లి: అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో జిల్లాలోని పీహెచ్సీల ఫార్మసిస్ట్లకు ‘అనీమియా ముక్త్ భారత్’పై సోమవారం శిక్షణ ఇచ్చారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ఐరన్ పోలిక్ ఆసిడ్(ఐఎఫ్ఏ) మాత్రల సరఫ రా, చైన్ మేనేజ్మెంట్పై ఫార్మసిస్టులు అవగా హన పెంచుకోవాలని సూచించారు. బోయినపల్లి మండలం విలాసాగర్ ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో రజిత, తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్సీ పరిధిలోని జిల్లెల్ల గ్రామాన్ని వైద్యాధికారులు కె.అనిత, రామకృష్ణ సందర్శించారు.