ప్రజా‘వాణి’ వినండి | - | Sakshi
Sakshi News home page

ప్రజా‘వాణి’ వినండి

Mar 18 2025 12:15 AM | Updated on Mar 18 2025 12:15 AM

ప్రజా‘వాణి’ వినండి

ప్రజా‘వాణి’ వినండి

సిరిసిల్లటౌన్‌: ప్రజావాణికి వచ్చే బాధితుల సమస్యలు విని, పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం అడిషనల్‌ కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి మొత్తం 113 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా రెవెన్యూకు 49 దరఖాస్తులు వచ్చాయి. డీఆర్డీవో శేషాద్రి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అర్జీలపై నిర్లక్ష్యం చూపొద్దు

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

113 దరఖాస్తుల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement