● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● సీఎమ్మార్ఎఫ్ చెక్కులు పంపిణీ
చందుర్తి/రుద్రంగి/కోనరావుపేట(వేములవాడ): ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండలాల్లోని లబ్ధిదారులకు ఆదివారం సీఎమ్మార్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. చందుర్తిలో 24 మందికి రూ.9.61లక్షలు, కోనరావుపేటలో రూ.8.38లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు. కిసాన్సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, పార్టీ మంలాల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, తర్రె మనోహర్, షేక్ ఫిరోజ్పాషా, ఏఎంసీ చైర్మన్లు చెలుకల తిరుపతి, ఎల్లయ్య, వైస్చైర్మన్లు బొజ్జ మల్లేశం, ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, సంతుపూరి బాలకృష్టారెడ్డి, జలపతి తదితరులు పాల్గొన్నారు.
వారిదే స్ట్రాంగ్ బంధం
వేములవాడ: గల్లీలో లొల్లి... ఢిల్లీలో దోస్తి అన్నట్లుగా బీఆర్ఎస్, బీజేపీల బంధం కొనసాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై వేములవాడలోని తన నివాసంలో కౌంటర్ ఇచ్చారు. మంత్రి బండి సంజయ్ మాటలు పరిశీలిస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ బంధం స్ట్రాంగ్గా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. గతంలో కేంద్రంలో ఈడీ, రాష్ట్రంలో ఐటీ, సీబీఐ, పోలీసులను అడ్డం పెట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. 15 నెలల క్రితం ఏర్పడిన ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అనంతరం సీఎమ్మార్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
రాజన్నకు పట్టువస్త్రాలు
వేములవాడ: శివకల్యాణం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ ఆదివారం పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భేరి పూజ, దేవత ఆహ్వానం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.