సిరిసిల్లక్రైం: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆలోచనతో బెట్టింగ్ చేయడంతో భవిష్యత్ నాశనమవుతుందని ఎస్పీ మహేశ్ బి.గీతే పేర్కొన్నారు. యాప్స్లలో బెట్టింగ్కు పాల్పడిన, ఆన్లైన్ గేమింగ్ యాప్లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వీటికి అలవాటు పడి యువత ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు. సోషల్మీడియా వేదికగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్లను ప్రమోట్ చేసే వారి సమాచారం అందించాలని కోరారు. నిఘా కఠినం చేసి బెట్టింగ్ తదితరాలను యువతకు తెలిపే వారిపై కేసు నమోదు చేసి చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామన్నారు.
● ఎస్పీ మహేశ్ బి.గీతే