
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం
వేములవాడ: వేములవాడలో రోడ్లపైనే కూరగాయలు అమ్ముకుంటున్న వైనంపై ‘సాక్షి’లో ఈనెల 15న ‘రోడ్లపైనే విక్రయాలు’ శీర్షికను కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ శనివారం వివరణ ఇచ్చారు. శామకుంటలో నిర్మించిన భవనంలో వంద మంది వ్యాపారులకు అవకాశం కల్పించామని, తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని, బైపాస్రోడ్డులోనే వ్యాపారులు, స్థానికులకు సౌకర్యాలతో రూ.40లక్షలతో ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు.
● వేములవాడ కమిషనర్ అన్వేశ్