
ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలోని అర్హులందరూ ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్కుమార్ఝా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం టీఫైబర్ సర్వర్ రూమ్ను పరిశీలించారు. అనంతరం నేరెళ్ల పీహెచ్సీని తనిఖీ చేశారు. ప్రభుత్వ వైద్య సేవలు సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే నేరెళ్ల టీజీఆర్ఎస్ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థులకు రాగిజావ ఇస్తుండగా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ప్రిన్సిపాల్ రాధను ఆదేశించారు. పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమాల్లో ఎంపీవో మీర్జా అఫ్జల్ బేగ్, మెడికల్ ఆఫీసర్ చంద్రికారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
నేడు మినీ జాబ్ మేళా
సిరిసిల్లకల్చరల్: ప్రైవేట్ కంపెనీ వైఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ ఖాళీలు భర్తీకి గురువారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేంద్ర తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ మహిళా అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల జిరాక్స్ప్రతులతో నేరుగా హాజరు కావాలన్నారు. ఎంపికై నవారికి రూ.15 వేల నుంచి రూ.20వేల నెలసరి వేతనంతో పాటు ఉచిత భోజనవసతి కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి, అర్హతలున్న మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 70935 14418 లేదా 90003 85863 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
నక్కవాగులోకి గోదావరి జలాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): వేసవిలో ఎండుతున్న పంటలకు గోదావరి జలాలు ఊపిరిపోస్తున్నాయి. ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది, సేవాలాల్తండా, గన్నెవారిపల్లె, పోతుగల్ గ్రామాల్లో నక్కవాగు, ఎల్లమ్మ వాగు పరివాహాక ప్రాంతాల్లో వేసిన వరిపంటలు ఎండుతున్నాయి. దీంతో మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్ల మీదుగా ప్రాజెక్టు కెనాల్తో నీటిని నక్కవాగులోకి వదిలారు. ఈమేరకు కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి ప్రాజెక్టు ఎస్ఈతో చర్చించి, మల్లన్నసాగర్ నీటిని నక్కవాగులోకి వదిలేలా చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యెల్ల బాల్రెడ్డి తెలిపారు. నక్కవాగులోకి జలాలు రాగానే భూగర్భ జలాలు పెరిగి, బోరుబావుల్లోకి నీరు వచ్చిందని పేర్కొన్నారు.
24 గంటలు.. 14 ఆపరేషన్లు
వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 24 గంటల్లో 14 రకాల ఆపరేషన్లు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. 11 మంది గర్భిణులకు డెలివరీలు చేశారు. అందులో ఆరు ఆపరేషన్లు, ఐదు సాధారణ కాన్పులు. ఇద్దరికి గర్భసంచి, ముగ్గురికి కంటి, ముగ్గురికి జనరల్ ఆపరేషన్లు చేసినట్లు పేర్కొన్నారు. ఏరియా ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని, వైద్యులు అందుబాటులో ఉన్నారని వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి

ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి