అమరుల త్యాగాలతోనే తెలంగాణ విమోచనం | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలతోనే తెలంగాణ విమోచనం

Sep 18 2023 9:30 AM | Updated on Sep 18 2023 9:30 AM

జాతీయ జెండాకు గౌరవవందం చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ - Sakshi

జాతీయ జెండాకు గౌరవవందం చేస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ

● బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ

వేములవాడ: త్యాగధనుల పోరాటాలతోనే తెలంగాణకు విమోచనం లభించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఆంధ్రాబ్యాంకు చౌరస్తాలో ఆదివారం జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారత స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనపై పోరాటం సాగిందన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అమరవీరుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ మాత్రం గత ముప్పై ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ రేగుల సంతోష్‌బాబు, నాయకులు ముప్పిడి శ్రీనివాస్‌, అన్నారం శ్రీనివాస్‌, పిన్నింటి హన్మండ్లు, రామతీర్థం హరీశ్‌, బిళ్ల కృష్ణ, నామాల శేఖర్‌, చందనం సత్తయ్య, వెంకన్న, మల్లేశంయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement