విత్తన గణపతులు పంపిణీ | - | Sakshi
Sakshi News home page

విత్తన గణపతులు పంపిణీ

Sep 18 2023 9:30 AM | Updated on Sep 18 2023 9:30 AM

విత్తన గణపతి ప్రతిమలు అందిస్తున్న నాయకులు - Sakshi

విత్తన గణపతి ప్రతిమలు అందిస్తున్న నాయకులు

బోయినపల్లి(చొప్పదండి): రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, జెడ్పీటీసీ ఉమ ఆధ్వర్యంలో ఆదివారం విత్తన గణపతులు పంపిణీ చేశారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, సిరిసిల్ల ఆర్డీవో ఆనంద్‌కుమార్‌లకు విత్తన గణపతి ప్రతిమలు అందించారు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, కవ్వంపల్లి రాములు పాల్గొన్నారు.

రైతాంగ పోరాటాన్ని

నడిపింది కమ్యూనిస్టులే

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరయ్య

సిరిసిల్లఅర్బన్‌: తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించింది కమ్యూనిస్టులే అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.వీరయ్య పేర్కొన్నారు. స్థానిక బీవైనగర్‌లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు బ హిరంగసభలో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో వెట్టిచాకిరీ, భూస్వాముల పెత్తందార్లకు వ్యతిరేకంగా కమ్యూనిలే ఎర్రజెండా పట్టుకొని పేదల తరఫున పోరాడామన్నారు. కానీ హిందూ, ముస్లిం పో రాటం జరిగినట్టుగా చిత్రీకరించి ప్రచారం చేస్తూ ప్ర జలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నట్లుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కై లాస్‌ బాబు, శాంతి ప్రకాశ్‌ శుక్లా, జిల్లా కమిటీ సభ్యులు మూశం రమేశ్‌, కోడం రమణ, ఎగమంటి ఎల్లయ్య, ఎర్రవెల్లి నాగరాజు, జవ్వాజి విమల, వీర్నపల్లి ఎంపీటీసీ మల్లారం అరుణ్‌కుమార్‌, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న వీరయ్య1
1/1

మాట్లాడుతున్న వీరయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement