న్యూస్రీల్
జిల్లాలో పెట్రోల్, డీజిల్ అవస్థలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 195 పెట్రోలు బంకులు ఉండగా దాదాపు 40 శాతం బంకులు మూతపడ్డాయి. మిగిలిన బంకుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరి కనిపించాయి. హైవేపై ఉన్న బంకుల వద్ద పెద్ద వాహనాలు కిలో మీటర్ల మేర నిలిచిపోయాయి. ఒంగోలు నగరంతో పాటు చుట్టుపక్కల తిరిగే దాదాపు 2 వేల ఆటోలు మూతపడ్డాయి. ఇదే అదునుగా ఆటో చార్జీలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్ ప్రభావం గ్రానైట్ పరిశ్రమపై కూడా పడుతోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే అధికార యంత్రాంగం మాత్రం ఎలాంటి కొరత లేదంటూ ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.
పెట్రోల్ వెక్కిరిస్తూ..


