
రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక
ఒంగోలు: ఫెన్సింగ్ రాష్ట్రస్థాయి పోటీలకు పలువురు క్రీడాకారులు ఎంపికయ్యారు. స్థానిక మినీ స్టేడియంలో గురువారం అండర్ 10, అండర్ 12 విభాగాల్లో ఎంపిక ప్రక్రియ జరిగింది. బి.వెంకట సౌమ్య, డి.షణ్ముక ప్రియ, ఉజ్జయిని అల్లం, సీహెచ్ జైత్ర, డి.చరణ్ సాయి ఫణీశ్వర్, టి.వెంకట అలితేష్ చౌదరి ఎంపికై నట్లు ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు, కోచ్ రాజు, జి.అనీల్లను ప్రకాశం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కరరావు, ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కూనపరెడ్డి శివశంకర్ అభినందించారు.
చెక్బౌన్స్ కేసులో జైలుశిక్ష
ఒంగోలు: చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలుశిక్ష విధిస్తూ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ రోషన్ గురువారం తీర్పునిచ్చారు. కుటుంబ అవసరాల నిమిత్తం టి.ఎలిజబెత్ రాణి అనే మహిళ 2014లో తన వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారని, బాకీ చెల్లింపు నిమిత్తం 2017లో రూ.6.20 లక్షలకు తనకు చెక్కు ఇచ్చినట్లు జె.రమేష్బాబు న్యాయస్థానంలో ఫిర్యాదుచేశారు. కేసు పూర్వాపరాలను విచారించిన న్యాయమూర్తి నిందితురాలు ఎలిజెబెత్ రాణిపై నేరం రుజువైనట్లు పేర్కొంటూ ఆరు నెలల జైలుశిక్ష, రూ.7.10 లక్షల పరిహారం, జరిమానా చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
194 మద్యం బాటిళ్లు స్వాధీనం
కంభం: మండలంలోని తురిమెళ్ల గ్రామంలోని బెల్టుషాపులపై గురువారం ఎకై ్సజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దాడిలో రాజేంద్ర అనే వ్యక్తి వద్ద 194 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ కొండారెడ్డి తెలిపారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి సదరు వ్యక్తిని గిద్దలూరు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచామన్నారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది రంగనాయకులు, శివాజీ, బాష, షంషీర్, రాజగోపాల్ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపిక