పాత సామాను సొమ్ము స్వాహా..! | - | Sakshi
Sakshi News home page

పాత సామాను సొమ్ము స్వాహా..!

Jun 28 2025 5:45 AM | Updated on Jun 28 2025 7:27 AM

పాత స

పాత సామాను సొమ్ము స్వాహా..!

దర్శి (కురిచేడు):

ర్శిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఎస్‌.మాధవరావు వింతపోకడకు తెరలేపారు. ప్రభుత్వం సరఫరా చేసిన వస్తువులు మరమ్మతులకు గురైతే వాటిని ప్రభుత్వ అనుమతితో విక్రయించి వచ్చిన నగదుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కచెప్పాల్సి ఉంది. కానీ, గురుకులంలోని ఒక ఉద్యోగిని అడ్డం పెట్టుకుని గురుకుల పాఠశాలలో ఉన్న పాత ఇనుప సామగ్రి, మోటార్లు, పాత పెట్టెలు, పుస్తకాలు మొత్తం సుమారు 5 ఆటోల వరకు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అనుమతి లేకుండా మాధవరావు విక్రయించారు. వచ్చిన నగదును తన ఖాతాలో జమచేసుకుని స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటి గురించి పాఠశాల అభివృద్ధి కమిటీకిగానీ, సొసైటీ పెద్దలకుగానీ తెలియజేయలేదని సమాచారం. పనికిరాని పాత సామగ్రినే కాకుండా పనికొచ్చే రెండు ట్రాలీలను కూడా విక్రయించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పిల్లలకు వంట తయారు చేసేందుకు ఉపయోగించిన గిన్నెలను ట్రాలీపై ఉంచి నెట్టుకుని తీసుకెళ్లి అన్నం వడ్డించాలి. ఇందుకోసం పాఠశాలకు ట్రాలీలు సరఫరా చేశారు. వాటిలో రెండు ట్రాలీలను కూడా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ విక్రయించినట్లు సమాచారం.

విద్యార్థులకు సీట్ల కేటాయింపు,

తదితర విషయాల్లోనూ చేతివాటం...

విద్యార్థులకు సీట్ల కేటాయింపులోనూ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ చేతివాటం ప్రదర్శించినట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాడు–నేడు పనుల్లోనూ సరిగ్గా లెక్కలు చూపకుండా, పనిచేసిన వారికి కూలి ఇవ్వకుండా అటెండర్లు, తనకు అనుకూలమైన సిబ్బంది ఖాతాలకు నగదును ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ బదిలీ చేసినట్లు కొందరు సిబ్బంది ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పెట్టాల్సిన చికెన్‌ కూడా సగం పెట్టి మిగతా సగానికి సంబంధించిన సొమ్ము స్వాహా చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. పాఠశాలలో విద్యార్థులకు పెట్టే భోజనం నాణ్యత లేకపోవడంతో తినలేక పడేస్తున్నారని, చద్దన్నం, రుచిలేని కూరలతో పెట్టడంతో కొంతమంది అనారోగ్యం పాలయ్యారని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కొంతమంది విద్యార్థులను మచ్చిక చేసుకుని సొసైటీ వారు, జిల్లా ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు వారితో ఎలా మాట్లాడాలో శిక్షణ ఇచ్చి తద్వారా పై అధికారుల వద్ద మార్కులు కొట్టేస్తున్నాడని సిబ్బంది, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలను విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న పాత్రికేయులు పాఠశాలను పరిశీలించేందుకు అనుమతి కోరగా, అవకతవకలు బయటపడతాయనే భయంతో నిరాకరించారు. పాఠశాలలో మరుగుదొడ్లను విద్యార్థులతో శుభ్రం చేయిస్తున్నారని తల్లిదండ్రులకు తెలియడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అపరిశుభ్రత వలన అంటువ్యాధులు ప్రబలుతున్నా వైద్యపరీక్షలు చేయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌పై గతంలో కలెక్టర్‌, డీసీఓకు కొందరు ఫిర్యాదు చేసినా అతని ప్రవర్తనలో మార్పురాలేదని, ఉన్నతాధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని సిబ్బంది తెలిపారు. సొసైటీ కార్యదర్శికి కూడా ఇటీవల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ అక్రమాలపై ఉన్నతాధికారులు విచారించి తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమ వద్ద ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయిస్తామని కొందరు సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ మాధవరావును వివరణ కోరేందుకు సాక్షి ఫోన్‌ చేయగా, ఆయన సమాధానం ఇవ్వలేదు.

దర్శి గురుకుల విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ వింతపోకడ

విద్యాలయంలోని పాత సామగ్రి విక్రయించగా వచ్చిన సొమ్ము

కాజేసినట్లు ఆరోపణలు

ముక్కున వేలేసుకుంటున్న సిబ్బంది

పాత సామాను సొమ్ము స్వాహా..! 1
1/3

పాత సామాను సొమ్ము స్వాహా..!

పాత సామాను సొమ్ము స్వాహా..! 2
2/3

పాత సామాను సొమ్ము స్వాహా..!

పాత సామాను సొమ్ము స్వాహా..! 3
3/3

పాత సామాను సొమ్ము స్వాహా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement