కష్టజీవులకేది కనీస మర్యాద? | - | Sakshi
Sakshi News home page

కష్టజీవులకేది కనీస మర్యాద?

Jun 28 2025 5:45 AM | Updated on Jun 28 2025 7:27 AM

కష్టజ

కష్టజీవులకేది కనీస మర్యాద?

పొదిలి: రైతుల కష్టంపై వచ్చే ఆదాయంతో నిర్వహించే పొగాకు వేలం కేంద్రంలో ఆ కష్ట జీవులు కునుకు తీసేందుకు సరైన సౌకర్యం లేదు. పొదిలి వేలం కేంద్రానికి రోజూ 200 నుంచి 300 మంది రైతులు వస్తుంటారు. వేలానికి ముందు రోజు రాత్రే బేళ్లతో చేరుకునే రైతులు కునుకు తీసేందుకు ఆపసోపాలు పడాల్సిన దుస్థితి. నాపరాళ్ల అరుగులపై నడుం వాల్చేందుకు ఇష్టపడని రైతులు ఆరు బయట ఫ్లోరింగ్‌పై నిద్రకు ఉపక్రమిస్తున్నారు. కొందరు రైతులు కటిక నేలపై పడుకోలేక లాడ్జిలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఏడాది ఆ నాపరాళ్ల అరుగుల గదిని బీహార్‌ ముఠా కార్మికులకు అప్పగించడంతో స్థానిక రైతులు కునుకు తీసే అవకాశమే లేకుండా పోయింది. బోర్డు ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు బస చేసేందుకు పరిపాలనా భవనంపై సర్వ హంగులతో అతిఽథి గృహం నిర్మించారు కానీ రైతులకు కనీస వసతి లేకుండా చేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

కష్టజీవులకేది కనీస మర్యాద? 1
1/1

కష్టజీవులకేది కనీస మర్యాద?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement